సత్తుపల్లి పోలీస్ స్టేషన్, తేది -23.10.2021
ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు యస్ వారియర్ గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో గల పాన్ షాప్ నిర్వాహకులకు, కల్లూరు ఏసిపి ఎన్. వెంకటేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ .రమాకాంత్ గారు సమావేశం నిర్వహించి, పాన్ షాప్ యజమానులు ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గంజాయి, మరియు మత్తు కు సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా పాన్ షాప్ నిర్వాహకులు తమ షాపు నందు ఎవరైనా అమ్మితే అట్టి వారి పై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెడతామని, సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ రమాకాంత్ గారు హెచ్చరించారు. ఈ నిషేధిత గుట్కా లు తిని చాలా మంది యువకులు అనారోగ్యం పాలవుతున్నారని వారు ఆరోగ్యపరంగా మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలియజేసినారు
No comments:
Post a Comment